ఆర్థిక నేరాలతోపాటు పలు క్రిమినల్ కేసుల(money laundering case)ను ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) వ్యవహారం ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)తోపాటు మరో నటి నోరా ఫతేహి (Nora Fatehi) పాత్ర కూడా ఉన్నట్టు ఇప్పటికే కథనాలు వచ్చాయి. వీరి విచారణ కూడా జరిగింది.
అయితే తాజాగా ముంబై పోలీసులు మరోసారి ఈ కేసులో నోరాఫతేహిని 7 గంటలపాటు విచారించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సుఖేశ్ వేర్వేరుగా జాక్వెలిన్, నోరాను టచ్లోకి తీసుకొని వారికి విడివిడిగా ఖరీదైన బహుమతులను పంపించాడని విచారణలో గుర్తించారట పోలీసులు. ముంబై పోలీసులు రానున్న రోజుల్లో మరికొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం.
నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లతోపాటు మరో ఐదుగురికి సమన్లు జారీచేసినట్టు స్పెషల్ CP (క్రైమ్-ఆర్థిక నేర విభాగం) రవీంద్ర సింగ్ యాదవ్ నేషనల్ మీడియాతో చెప్పుకొచ్చారు. సుఖేష్ కేసుకు సంబంధించి నిన్న నోరాఫతేహిని సుమారు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ సమయంలో ఆమె సహకరించారు. కానీ ఇప్పటికీ కొన్ని సమాధానాలు దొరకని ప్రశ్నలున్నాయి. చెన్నైలో తనను ఆహ్వానించిన ఈవెంట్కు ఈ క్రైమ్ సిండికేట్తో సంబంధాలున్నాయని తనకు తెలియదని నోరా చెప్పారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని యాదవ్ అన్నారు.