బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం సక్సెస్ఫుల్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ కాగా, సోమవారం జరిగిన 51వ ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు.ఇది కాస్త వెరైటీగాస ఆగింది. బిగ్ బాస్లో అడుగుపెట్టి 50 రోజులు పూర్తైందని తెలియజేసిన బిగ్ బాస్ మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించాడు. కాని అక్కడే చిన్న ట్విస్ట్ పెట్టాడు.
అయితే పోస్ట్ వచ్చిన ప్రతిసారి ఇద్దరు ఇంటిసభ్యుల్ని పిలుస్తారు. వారి పేర్లు పిలిచినప్పుడు ఇద్దరు ఇంటి సభ్యులు పవర్ రూంకి వచ్చి పోస్ట్ బ్యాగ్ను తీసుకోవాల్సి ఉంటుందని పోస్ట్ బ్యాగ్ లోపల.. హౌస్లో ఉన్న వాళ్లలో ఇద్దరు ఇంటి సభ్యుల ఇంటి దగ్గర నుంచి వచ్చిన లేఖ ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఒకరే లేఖను అందుకుని మరొకరి లేఖను షెడర్లో వేసి ముక్కలు చేయాలని బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టాడు. లేఖను అందుకున్న వారు సేవ్ అవుతారని, మిగతా వారు నామినేట్ అవుతారని తెలియజేశాడు బిగ్ బాస్.
అంతకముందు ప్రియాంక – అనీమాస్టర్ మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది. మనం ఎవరి కోసమో ఆడొద్దు.. మనకోసం మనం ఆడుదాం. రవి ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడో చూశాం కదా.. అంటూ ఆనీ మాస్టర్ ప్రియాంకకి హితబోధ చేసింది. ఇక లోబోకి తనకి మధ్య ఏర్పడిన గ్యాప్ని క్లియర్ చేసాడు రవి. ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు ఫ్రెండ్ క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు అంటూ లోబోని క్షమించేశాడు రవి. ఆ తరువాత ఆనీ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఏడ్వడం మొదలుపెట్టాడు లోబో. ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావా అంటూ అనీ మాస్టర్ సెటైర్ వేసింది.
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని