టాలీవుడ్ (Tollywood) యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) ఇంట విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ (Shyam Siddharth) ఇవాళ (ఏప్రిల్ 28) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ సిద్దార్థ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో నిఖిల్ ఇంట తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్యామ్ సిద్దార్థ్ మరణవార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిఖిల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. హ్యాపీడేస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిసిన నిఖిల్ సిద్దార్థ్…ఆ తర్వాత సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు..తనకంటూ ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
కొత్తదనంతో కూడిన కథలు చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ సాగిస్తున్న నిఖిల్కు..తండ్రి చనిపోవడం తీరని దు:ఖాన్ని మిగులుస్తోంది. నిఖిల్ 2020 మే 14న పల్లవి వర్మను పెళ్లి చేసుకుని..ఓ ఇంటివాడయ్యాడు.
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్గా కియారా తాజా పోస్ట్