ఇటీవలి కాలంలో ప్రేక్షకులకు మంచి వినోదం పంచిన చిత్రాలలో జాతి రత్నాలు ఒకటి. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరించింది. సామాన్యులు, సినీ,రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్.. జాతి రత్నాలు తర్వాత స్టార్ అయిపోయాడు. ఇప్పుడు కరోనా వలన ఇంటికే పరిమితమైన నవీన్ తన అభిమానుల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
ఇటీవల నవీన్ పొలిశెట్టి అభిమాని సాయి స్మరణ్ అనే కుర్రాడి తండ్రి కరోనాతో కన్నుమూశారు. దాంతో ఆ కుటుంబం అంతా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. తన తల్లి బాధతో కుంగిపోతుందని, జాతిరత్నాలు సినిమా చూసాక కొద్ది బాధను మరచిపోయిందని సాయి స్మరణ్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్పై వెంటనే స్పందించిన నవీన్.. ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అమ్మకు ‘జాతిరత్నాలు’ కొంతవరకూ ఊరట కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంది.త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అంటూ అభిమాని తల్లితో కొద్ది సేపు వీడియో కాల్లో ముచ్చటించాడు నవీన్. అతని చూపిన చొరవపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.