మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. ఆయన శరీరంలో అన్ని ప్రధాన అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వైద్యులు వెల్లడించారు.
సాయి ధరమ్ని పలువురు ప్రముఖులు పరామర్శిండంతో పాటు సోషల్ మీడియాలో త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ నా బిడ్డలాంటి వాడు. ఆయన త్వరగా దీని నుంచి కోలుకొని మళ్ళీ షూటింగులకి హాజరవుతాడని ఆ భగవంతుణ్ణి, మా అమ్మను కూడా ప్రార్ధిస్తున్నాను. సాయి ధరమ్, మా అబ్బాయి నవీన్ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. బ్రదర్స్ లా.
నిన్న సాయంత్రం ఇక్కడి నుంచే వెళ్ళారు. నేను ఆ బైక్ సౌండ్స్ విని వెళ్ళేలోపే బయలుదేరిపోయారు. ఓ నాలుగు రోజుల క్రితం కూడా వీరికి కౌన్సిలింగ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మంచి వయసులో ఉన్నారు. పెళ్ళి చేసుకోవాల్సిన వాళ్ళు..మంచి కెరీర్ ఉన్నవాళ్ళు. ఇలాంటి సమయంలో లైఫ్ రిస్క్లో ఎవరు తీసుకోకూడదు.
నేను కూడా ఇంతకు ముందు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ నాచేత ఒట్టేయించుకుని బైక్లు మానిపించారు. అప్పటి నుంచి నేను బైక్లు ముట్టడం లేదు. సాయిని చూడడానికి ఆసుపత్రికి వద్దామనుకున్నాను. కానీ అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇక్కడి నుంచే వీడియో ద్వారా మాట్లాడుతున్నాను. త్వరలో సాయి ధరమ్ తేజ్ని కలుసుకుంటాను..’’ అని తెలిపారు. కోట గారి, బాబు మోహన్ గారి అబ్బాయిలు కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టి వెళ్లారు. అందరి శ్రేయస్సు కోసం బైకులు ముట్టుకోకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను అని నరేశ్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
NTR: సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన ఎన్టీఆర్
Health Bulletin: సాయి తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్.. !
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
Sai Dharam Tej: సాయి తేజ్పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Sai dharam Tej: ప్రమాదం సమయంలో సాయి తేజ్ వాడిన బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?