అభిమానులు, ఫాలోవర్ల సంఖ్య విషయంలో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో నిలుస్తాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt). వివాదాలను దాటుకుని విజయ వంతంగా సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు సంజూ భాయ్. ఈ మున్నాభాయ్ మరోవైపు క్యాన్సర్ మహమ్మారిని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ చాఫ్టర్ 2లో అధీరాగా సరికొత్త లుక్ తో అదరగొట్టేందుకు సిద్దమవుతున్నాడు.
మరోవైపు షంషీరా, పృథ్విరాజ్ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. వీటిలో షంషీరా షూటింగ్ పూర్తి చేసుకోగా..కేజీఎఫ్ 2, పృథ్విరాజ్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇక ఈ సినిమాల చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత సంజూ భాయ్ తన సమయాన్ని పిల్లల కోసం కేటాయించనున్నాడట. ఈ విషయమై సంజయ్ దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నా పిల్లలకు సంజు సినిమా చాలా ఇష్టం. నాతో కలిసి సినిమా చూడాలని వాళ్లు ఎప్పుడూ అనుకుంటారని చెప్పాడు.
మీ పిల్లలు సినిమాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ..నా కూతురులో ఆర్టిస్ట్ దాగి ఉంది. ఇక కొడుకు షారాన్ (Shahraan) నటుడవ్వాలని బలంగా కోరుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో అతడు పెద్ద స్టార్ కావడం ఖాయమంటూ చెప్పుకొచ్చాడు. సంజయ్ దత్ మొదటి భార్య సంతానంగా త్రిషాలా దత్ (Trishala Dutt) అనే కూతురుంది. త్రిషాలా సైకియాట్రిస్ట్. మొత్తానికి భవిష్యత్లో తన వారసుడిగా షారాన్ రాణిస్తాడని సంజయ్ దత్ బలంగా విశ్వసిస్తున్నాడు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?