మైదానంలో స్టన్నింగ్ ఆటతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni). తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుతంఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రేజీ స్టార్ క్రికెటర్ ఇపుడు తమిళ ప్రజలతో తన బాండింగ్ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడనకుంటున్నారా..? తమిళ సినిమాల ప్రొడక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాడట ధోనీ.
తాజా సమాచారం ప్రకారం ఎంఎస్ ధోనీ త్వరలోనే నిర్మాత (producer) గా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే లేడీ సూపర్ స్టార్గా పాపులారిటీ పొందిన నయనతార (Nayanthara) ఈ చిత్రంలో లీడింగ్ లేడీగా నటించబోతుండటం. ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేకున్నా..ఈ వార్త మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత ధోనీ నిర్మించే ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండనుందని తెలుస్తోంది.
నయనతార ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలతోపాటు ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. అంతేకాదు స్టార్ డైరెక్టర్ ఆట్లీ దర్శకత్వంలో షారుక్ఖాన్ హీరోగా వస్తున్న చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇస్తోంది నయనతార. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్పై క్లారిటీ రానుండటంతో..ప్రస్తుతానికి మాత్రం ఈ వార్తను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ధోనీ, నయన్ అభిమానులు.