జనతా గ్యారేజ్ సినిమాతో టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో మోహన్ లాల్ తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకున్నాడు. చాలా కాలం క్రితం అనౌన్స్ మెంట్ చేసి నిలిచిపోయిన మోహన్ లాల్ సినిమాకు సంబంధించిన వార్త ఇపుడు బయటకు వచ్చింది.
దృశ్యం ఫేం జీతూ జోసెఫ్ డైరెక్షన్లో 2019లో రామ్ పార్టు 1 (Ram: Part 1)ను ప్రకటించాడు మోహన్ లాల్. అయితే పలు కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే అప్డేట్ తెరపైకి వచ్చింది. ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందట. సినిమాలో అగ్రభాగం లండన్, పారిస్, మొరాకో దేశాల్లో షూటింగ్ జరుగనుందని టాక్. తాజా అప్డేట్ ప్రకారం సుమారు 2 నెలల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.
యాక్షన్ అడ్వంచెరస్గా రాబోతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలిమ్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ (Trisha Krishnan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విష్ణు శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలపై త్వరలో టీం క్లారిటీ ఇవ్వనుంది.