లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). మల్టీస్టారర్గా వస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా వస్తుండగా..మొదటి భాగం పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1)సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు ఈ భారీ మల్టీస్టారర్కు ఓ కనెక్షన్ ఉందట. ఇపుడీ వార్త ఇండస్ట్రీ సర్కిల్ను రౌండప్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే ఈ చిత్రాన్ని మణిరత్నం 1994 కాలంలోనే కమల్ హాసన్తో తీయాలనుకోగా.. అయితే పలు కారణాలతో అది కుదరలేదట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే 2010లో అంటే 15 ఏండ్ల తర్వాత ఈ చిత్రంలో అరుల్ మొజి పాత్ర కోసం మణిరత్నం మహేశ్ బాబును సంప్రదించగా..ప్రిన్స్ కూడా ఆసక్తి చూపించాడట.
కానీ అప్పట్లో ఫైనాన్షియర్లు దొరక్కపోవడంతో సాధ్యం కాలేదని ఇన్ సైడ్ టాక్. ఫైనల్గా 2019లో ఈ సినిమా కోసం ఫైనాన్షియర్లు దొరకడం..ఆ వెంటనే విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్తోపాటు పలువురు స్టార్ యాక్టర్లను ఒకే చేసి గ్రాండ్గా లాంఛ్ చేశాడు మణిరత్నం. మొత్తం ఎప్పుడో చేయాల్సిన పొన్నియన్ సెల్వన్ ప్రాజెక్టు చాలా ఏండ్లకు పట్టాలెక్కిందన్నమాట. పొన్నియన్ సెల్వన్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతుంది.