సముద్ర కెరటం ఉప్పొంగుతుంది. అది వెనక్కి వెళ్లింది కదా అని అజాగ్రత్తగా ఉంటే సునామి వచ్చినట్టు వచ్చి ఉధృతిగా వస్తుంది. నేను సమర్ధుడిని కాదు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని మోహన్ బాబు (Mohan Babu) పలువురిని హెచ్చరించారు. మా సభ్యత్వానికి ప్రకాశ్రాజ్, నాగబాబు రాజీనామా చేసిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ..వేదికలపై ఎలా పడితే అలా తాను మాట్లాడనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్తగా గెలిచిన మా అసోసియేషన్ సభ్యులకు మోహన్ బాబు పలు సూచనలు చేశారు.
మన గురించి ఎవెరెవరో ఏదేదో మాట్లాడుతుంటే అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు చెప్పాలి. అన్నీ గమనిస్తూ ఎప్పుడు సమాధానం చెప్పాలో ఎదురుచూశాను. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. టీవీలో కనిపించాలని చాలా మంది సినిమా యాక్టర్లకు ఉంటుంది. కళామతల్లిని నమ్మిన వ్యక్తే మా అధ్యక్షుడు కావాలని చెప్పాను. ‘మా’లో ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారని మోహన్ బాబు చెప్పారు.
గెలిచిన ‘మా’ సభ్యులందరికి రేపనేది క్వశ్చన్ మార్కు అని, అందరూ బాధ్యతగా ముందుకెళ్లాలని సూచించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మాకు సాయం చేయాలని అడగాలని సూచించారు. వారికి విజ్ఞప్తి చేస్తే సహకరిస్తారు. సభ్యులకు ఇష్టం వచ్చిన పార్టీలుండొచ్చు. ఇక్కడంతా ఒకే పార్టీ. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని మోహన్ బాబు అన్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు