అతిక్రమిస్తే చర్యలు తప్పవు
సడలింపు తర్వాత దుకాణాలు, హోటళ్లు మూసివేయాలి
సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి
సంగారెడ్డి, జూన్ 1 : ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డి కొత్త బస్టాండ్లో లాక్డౌన్ను పరిశీలించి సడలింపు సమయం దాటిన తరువాత తిరుగుతున్న వాహనదారులకు జరిమానా విధించారు. సడలింపు సమయం దాటిన కూడా రోడ్లపై తిరిగే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని ఆపి వివరాలు అడిగారు. దుకాణాలు సడలింపు సమయం ముగిసిన వెంటనే మూసివేయాలన్నారు. కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం మరో 10 రోజులు లాక్డౌన్ పొడిగించిందని, సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నిబంధనలు పాటించాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట అనంతరం దుకాణాలు, హోటళ్లు మూసివేయాలన్నారు. కార్యక్రమంలో డీఎ స్పీ బాలాజీ, పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు రమేశ్, శివలింగం, ఎస్ఐలు బాలస్వామి, సుభాశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.