కార్పొరేషన్, ఏప్రిల్ 20: నగర ప్రజలు ఏ నమ్మకంతో అయితే నగరపాలక సంస్థలో అధికారాన్ని కట్టబెట్టారో.. ఆ నమ్మకాన్ని నిలబెడతామని, కరీం‘నగరాన్ని’ అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మంగళవారం 35వ డివిజన్ సప్తగిరికాలనీ ప్రభుత్వ స్కూల్ వద్ద ఓపెన్ జిమ్ను మేయర్ సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో తమకు అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామన్న మాటలతో బల్దియా ప్రజలు పూర్తి మెజార్టీతో తమను గెలిపించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించబోమని, అన్నీ నెరవేర్చుతామని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇస్తున్న నిధులతో నగరంలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధికి ఆటంకం కలుగకుండా పని చేస్తున్నామని చెప్పారు.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని, శారీరక దారుఢ్యం కోసం బల్దియా ఆధ్వర్యంలో కళాశాల గ్రౌండ్లు, ఓపెన్ ప్రాంతా ల్లో వాకింగ్ ట్రాక్స్తో పాటు ఓపెన్ జిమ్స్ ను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. డివిజన్కు ఒక జిమ్ పెడుతున్నామని, ప్రస్తుతం మొదటి విడుతలో 30 ఏర్పాటు చేశామని వివరించారు. నగర ప్రజలకు ఏది అవసరమో దానిని అందిస్తామని చెప్పారు. నగరంలో 24 గంటల మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని, ఇచ్చిన మాట ప్రకారం అద్భుతమైన నగరంగా తయారు చేస్తామని పునరుద్ఘాటించారు. కేబుల్ బ్రిడ్జి మీద బ్లాక్ టాప్ కూడా వేసుకున్నామని, మానేరు రివర్ ఫ్రంట్ కోసం పనులు సాగుతున్నాయని, ఇవన్నీ పూర్తయితే నగర రూపురేఖలు పూ ర్తిగా మారిపోతాయని చెప్పారు.
రానున్న రెండున్నరేళ్లలో మరింతగా కష్టపడి అభివృద్ధి చేస్తామని వివరించారు. కరోనా మొ దటి వేవ్లో కూడా తాము ఎక్కడ భయప డి పారిపోలేదని, ప్రజల్లోనే ఉండి దానిని ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా అలాం టి కార్యక్రమాలను తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్కు పా జిటివ్ రావడంతో ప్ర పంచంలోని చాలా మంది అభిమానులు బాధపడుతున్నారని తెలిపారు. సీఎం త్వర గా కోలుకోవాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఇంటికీ అందుతున్న మంచినీరు, సం క్షేమ ఫలాల్లో సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారని, ప్రజల ఆశీస్సులతో త్వరగా కోలుకుంటారనే నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ఇక్కడ నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు చాడగోండ బుచ్చిరెడ్డి, దిండిగాల మహేశ్, తోట రాములు, వాల రమణారావు, నాయకులు, అధికారులు ఉన్నారు.