చిరంజీవి, మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రలలో కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ఆపద్బాంధవుడు. 1992లో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్టైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ద్వారా మీనాక్షికి కూడా మంచి పేరు వచ్చింది. ఆపద్భాందవుడు తర్వాత మీనాక్షి బాలీవుడ్లోను అనేక ఆఫర్స్ అందుకొని స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు తన హవా నడిపించింది. హిందీలో దాదాపు 30కి పైగా సినిమాలలో నటించడంతో ఆమె క్రేజ్ పీక్స్కి చేరింది.
కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే హరీష్ మైసూర్ అనే వ్యక్తిని 1995లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకి ఒక పాప, బాబు ఉన్నారు. 57 ఏళ్ల మీనాక్షి లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, మీనాక్షి ముఖం పూర్తిగా కళ తప్పిపోయి వయస్సు ముదిరినట్టుగా కనిపిస్తుంది. అభిమానులు ఆమెని చూసి నోరెళ్లపెడుతున్నారు. ఏదేమైన హీరోయిన్స్ గ్లామర్ ప్రపంచంలో ఉన్నంత వరకే బాగుంటారు, ఒక్కసారి బయటకు వచ్చారో వారిని గుర్తు పట్టడం చాలా కష్టం అన్నట్టుగా మారిపోతుంటారు.