ట్రెండ్ మారింది..సినిమా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ ఒకటి ఉంటే మాత్రమే సరిపోదు..పర్ఫెక్ట్ ప్లానింగ్తో సరైన సమయంలో థియేటర్లలో విడుదల చేయాలి. ఏ మాత్రం మిస్ మ్యాచ్ అయినా ఫలితం డిజాస్టర్ రూపంలో పలుకరిస్తుంది. కొంత కాలంగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాఫ్టర్ 2, ఆచార్య లాంటి పెద్ద సినిమాలుండటంతో చిన్న సినిమాలకు బ్రేక్ పడ్డది. ఇక ఆచార్య బాక్సాపీస్ వద్ద డీలా పడిపోవడంతో ఇపుడు మూడు చిన్న సినిమాలు (Telugu Movies) బాక్సాపీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి.
మే 6న విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam) , శ్రీవిష్ణు, కేథరిన్ నటించిన భళా తందనాన (Bhala Tandanana), యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ (jayamma Panchayathi) ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. ఇప్పటికే విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, సుమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. కాగా అయితే ఈ ముగ్గురికి ఊహించని సినిమా ఒకటి శత్రువు రూపంలో వెంటాటబోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ జనాలు.
పాపులర్ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న డాక్టర్స్ స్ట్రేంజ్ (Doctor Strange) సినిమా కూడా ఇదే తేదీన అంటే మే 6న విడుదలవుతుంది. ఈ సినిమాకు మెట్రో సిటీస్లో అడ్వాన్స్ బుకింగ్ భారీగానే అవుతున్నాయట. ఒకవేళ ఈ చిత్రం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం..తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి రొటీన్ తెలుగు సినిమాలను పక్కన పడేసి..మార్వెల్ ప్రాజెక్టును థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయమని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే బాక్సాపీస్ వద్ద ఈ మూడు సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది మాత్రం ప్రశ్నార్థకమే.