సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఈ కాంబోలో మూవీ వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఎగ్జయిటింగ్గా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో కమల్ హాసన్, మణిరత్నం కాంబో ఒకటి. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన ‘నాయకుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 1987లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. అంతేకాకుండా గ్యాంగ్స్టర్ కథలకు ఈ చిత్రం పునాది వేసింది. ఇప్పటికీ చాలా మంది మణిరత్నం బెస్ట్ వర్క్ ఏది అంటే నాయకుడు అనే చెప్తుంటారు. అంత రియలిస్టిక్గా, పోయేట్రిగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక అంతే గొప్పగా కమల్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ చిత్రంలో కమల్ నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. సినిమా వచ్చి 35ఏళ్ళయినా ఇప్పటికీ కొత్త ఫీల్ను ఇస్తుంటుంది.
ఈ చిత్రం తర్వాత వీళ్లిద్దరి కలిసి మరో సినిమా చేయలేదు. మళ్ళీ ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫలితం దక్కింది. తాజాగా కమల్, మణిరత్నంతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం కమల్కు 234వ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలంస్, రెడ్ జియాంట్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్ళనుంది.
ఇక కమల్ చాలా కాలం తర్వాత ‘విక్రమ్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అదే జోష్తో శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది. ఇక మణిరత్నం ఇటీవలే ‘పొన్నియన్ సెల్వన్’తో బ్లాక్బస్టర్ హిట్టు సాధించాడు. ప్రస్తుతం ఈయన పొన్నియన్సెల్వన్ పార్ట్-2 పోస్ట్ ప్రొడక్షన్లలో బిజీగా ఉన్నాడు. సెకండ్ పార్టు వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానుంది.
Read Also:
Adipurush Movie | సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న ‘ఆదిపురుష్’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
వీఎఫ్ఎక్స్ కోసం మరో రూ.100 కోట్లు.. ‘ఆదిపురుష్’ మేకర్స్ రిస్క్ చేస్తున్నారా?
Rishab shetty | ‘కాంతార’ హీరో సినిమాల్లోకి రాకముందు అలాంటి పనులు చేసేవాడట..!
Pathaan Movie | ‘పఠాన్’ టీజర్ సరికొత్త రికార్డు..!