Adipurush Movie | ‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ప్రభాస్ సినిమా వస్తుందంటే టాలీవుడ్ ప్రేక్షకులే కాదు ఇతర ఇండస్ట్రీల సినీ ప్రేక్షకులు కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఆదిపురుష్’ పైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఇటీవలే రిలీజైన ఆదిపురుష్ టీజర్కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రభాస్ను యానిమేషన్లో చూడటంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రభాస్ను యానిమేటెడ్గా చూపించడం ఏంటి ఓం రౌత్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వీఎఫ్ఎక్స్ కూడా బాగాలేదని, వీడియో గేమ్ మాదిరిలా ఉందని పలువురు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై ఓం రౌత్ స్పందించి ఆదిపురుష్ చిత్రాన్ని ఫోన్లో చూడటం కోసం కాదు, థియేటర్లో చూడటం కోసం తెరకెక్కించామని చెప్పాడు. అంతేకాకుండా థియేటర్లో 3డీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అయితే 3డీ ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.
కాగా చిత్రబృందం వీఎఫ్ఎక్స్పై మరోసారి కూర్చోవాలని నిర్ణయించుకుందట. దానికోసం మరో రూ.100 కోట్లు మేకర్స్ వెచ్చించనున్నారట. అయితే చిత్రబృందం ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చుచేశారు. ఇక ఇప్పుడు వీఎఫ్ఎక్స్ కోసం మరో 100 కోట్లు కేటాయించడం అంటే రిస్క్ అనే చెప్పాలి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాపై మేకర్స్కు గట్టి నమ్మకమున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అందుకోసమే మేకర్స్ ఈ రిస్క్ తీసుకుంటున్నారట.
రామయణం కథను బేస్ చేసుకొని ఓంరౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా.. రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ప్రభాస్కు జోడీగా కృతిసనన్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజున మరో మూడు సినిమాలు రిలీజవుతుండటంతో ఈ సినిమాను సమ్మర్కు పోస్ట్ పోన్ చేయనున్నారట. దాంతో మూవీ రిలీజ్కు సమయం ఉండటంతో ఈ సినిమా వీఎఫ్ఎక్స్ను కాస్త మెరుగు పరిచాలని డిసైడ్ అయ్యారట.