Actor Rishab shetty | ‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో రిషబ్శెట్టి. ఈ చిత్రంలో నటుడిగా, దర్శకుడిగా రెండు విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. భాషతో సంబంధంలేకుండా అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్లో రిషబ్ శెట్టి నటన వర్ణణాతీతం. ఇదే విషయాన్ని రజనీకాంత్తో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రిషబ్శెట్టి తను సినిమాల్లోకి రాకముందు ఏయే పనులు చేశాడో అభిమానులతో పంచుకున్నాడు.
రిషబ్శెట్టి సినిమాల్లోకి రాకముందు చాలా కష్టాలు పడ్డాడని వెల్లడించాడు. కనీస అవసరాల కోసం వాటర్ క్యాన్లు అమ్మేవాడనని తెలిపాడు. అంతేకాకుండా హోటల్లలోనూ పనిచేసినట్లు చెప్పాడు. అయితే ప్రస్తుతం తన కెరీర్ హ్యిపీగా సాగుతుందని తెలిపాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన రిషబ్ ‘రిక్కీ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే అదే ఏడాది రిలీజైన ‘కిరాక్ పార్టీ’ దర్శకుడిగా రిషబ్కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఇటీవలే రిలీజైన కాంతార చిత్రంతో అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా మంచి మార్కులు కొట్టెసాడు.
కాంతార చిత్రం సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజై.. మొదటి రోజు నుండి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా ఈ చిత్రానికి అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్బస్టర్ నిలిచింది. ఇప్పటివరకు కాంతార చిత్రం రూ.250 కోట్ల కలెక్షన్లను సాధించింది. తెలుగులో ఈ సినిమా ఇటీవలే రూ.50 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది.