విక్రమ్ సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలెంటెడ్ స్టార్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan). స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో 234వ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ చిత్రానికి కమల్ హాసన్ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 1987లో వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామా నాయగన్ తర్వాత ఈ ఇద్దరి కాంబో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట మణిరత్నం. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం మణిరత్నం దక్షిణాది సినీ పరిశ్రమలోని పాన్ ఇండియా యాక్టర్లతోపాటు బాలీవుడ్ యాక్టర్లను ఎంపిక చేసేందుకు స్కెచ్ వేశాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటించనుండగా.. మమ్ముట్టి, షారుఖ్ ఖాన్తోపాటు పాపులర్ స్టార్ హీరోలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. అయితే దీనికి సంబంధించిన మణిరత్నం కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజర్గా పనిచేస్తున్నాడు.
మణిరత్నం హోంబ్యానర్ మద్రాస్ టాకీస్, కమల్ హాసన్ హోంబ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్ బ్యానర్ రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. ఇండియన్ 2 షూటింగ్ దశలో ఉంది.
Read Also : Mahesh Surapaneni | సినిమాల్లో పాటలు అవసరం లేదు.. ఆ సినిమాలే స్పూర్తి.. హంట్ డైరెక్టర్ మహేశ్ చిట్చాట్
Read Also : Selfiee Trailer | స్టార్ హీరో వర్సెస్ అభిమాని.. అక్షయ్ కుమార్ సెల్ఫీ ట్రైలర్
Read Also : Honey Rose | వీరసింహుని విజయోత్సవం.. స్పెషల్ అట్రాక్షన్గా హనీరోజ్
Read Also : Mangli | మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. షో నుంచి తిరిగొస్తుండగా ఘటన..!