Manchu vishnu | Maa elections | మా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరువయ్యాయి. తెల్లారితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆదివారం సాయత్రంలోగా మా అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరో తేలిపోనుంది. దీంతో దాదాపు గత రెండు నెలలుగా రసవత్తరంగా సాగిన ప్రచార పోరుకు రేపటితో ఎండ్ కార్డు పడనుంది. ఈ క్రమంలో మా అధ్యక్ష ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని చెప్పాడు. అంతేకాకుండా గెలిస్తే తానేం చేయబోతున్నాడో కూడా మా సభ్యులకు వివరిస్తానని చెప్పుకొచ్చాడు.
మా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు.. శుక్రవారం సాయంత్రం మేనిఫెస్టో డిన్నర్ పార్టీ ఇచ్చారు. అయితే దీనిపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్లోని పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను చేసింది తప్పయితే ఎలక్షన్ ఆఫీసర్ సస్పెండ్ చేయవచ్చని పేర్కొన్నారు. నిజానికి ఈ పార్టీకి 250 నుంచి 300 మంది వరకు వస్తారని అనుకున్నాం.. కానీ దాదాపు 560 మంది వచ్చారని చెప్పాడు. వీరంతా మా సభ్యులేనని.. వారంత తనతోనే ఉన్నారని పేర్కొన్నాడు. నా కుటుంబసభ్యులను పిలిచి.. నాకెందుకు ఓటు వేయాలో చెప్పాను.. వాళ్లకు నచ్చితే ఓటేస్తారు.. వాళ్లంతా పాజిటివ్గా స్పందించారని పేర్కొన్నారు. మా చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు జరగని రీతిలో ఇతర ప్రాంతాల్లో ఉన్న మా సభ్యులు కూడా ప్రత్యేక విమానంలో వచ్చి ఓటు వేసి వెళ్తారని చెప్పుకొచ్చారు. తన ప్యానెల్ మొత్తం గెలిస్తేనే హామీలు అన్ని అమలు చేయగలనని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA Elections | ‘మా’ సభ్యులకు మోహన్బాబు వాయిస్ మెస్సేజ్
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Naga Babu: ఎన్నికల సిత్రం.. ప్రకాశ్ రాజ్ని విమర్శించిన ట్వీట్స్ తొలగించిన నాగబాబు
Maa elections | మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి అసహనం..
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ