Kundara Johny | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మలయాళ (Malayalam) చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు కుందర జానీ (Kundara Johny) మంగళవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 71. మంగళవారం సాయంత్రం సమయంలో ఆయనకి హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కొల్లాంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటు (cardiac arrest)తో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.
100కి పైగా చిత్రాల్లో నటించిన జానీ 1979లో ‘నిత్యవసంతం’తో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశారు. ‘అగ్నిపర్వతం’, ‘రాజావింటే మకన్’, ‘ఆవనాజి’, ‘నాడోడిక్కట్టు’ చిత్రాల్లో పోషించిన పాత్రలు జానీకి మంచి గుర్తింపు తెచ్చాయి. ‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’, ‘కిరీడం’, ‘చెంకోల్’, ‘స్పదికం’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. జానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరితమే. 2010 సంవత్సరంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన ‘రౌడీయిజం నశించాలి’ అనే సినిమాలో నటించారు. ఇక ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో వచ్చిన మెప్పడియాన్ (2022) చిత్రంలో ఆయన చివరిసారిగా తెరపై కనిపించారు.
Also Read..
Jana Reddy | సీఎం పదవి నన్ను కోరుకుంటున్నది.. కాంగ్రెస్ నేత జానారెడ్డి
Rahul Gandhi | తెలంగాణలో బీజేపీని ఓడిస్తాం.. రాహుల్ గాంధీ ప్రగల్బాలు