Rahul Gandhi న్యూఢిల్లీ, అక్టోబర్ 17: రోజురోజుకు మసకబారుతున్న కాంగ్రెస్ పరిస్థితి చూసో లేదా వరుస ఓటములతో డీలాపడటంతోనే ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ ఓటమి ఖాయమంటూ వ్యాఖ్యానించి తమ పార్టీ ఓటమిని డిసైడ్ చేసేసిన ఆయన.. తాజాగా మరోసారి నాలుకర్చుకొన్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడించామని చెబుతూ.. అదే ఊపులో తెలంగాణలో కూడా అసలు అధికారంలో లేని కమలం పార్టీని ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికారు.
వచ్చే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమంటూ నేలవిడిచి కర్రసాము చేసినట్టుగా ఆయన గొప్పలకు పోయారు. ‘కర్ణాటకలో బీజేపీని ఓడించాం. అదే మాదిరి తెలంగాణలో కూడా బీజేపీని మట్టికరిపిస్తాం. మధ్యప్రదేశ్లో ఆ పార్టీని అంతం చేస్తాం. ఛత్తీస్గఢ్లో చిత్తు చేస్తాం. గత ఎన్నికల్లో రాజస్థాన్ను ఓడించి అధికారంలోకి వచ్చాం. మళ్లీ దానినే పునరావృతం చేస్తాం. ఈశాన్యంలో కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తాం. కాంగ్రెస్ ఆలోచనలను తక్కువగా అంచనా వేయొద్దు’ అని చెప్పుకొచ్చారు.