టాలీవుడ్ (Tollywood) హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం (Parasuram) దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 12న రిలీజైంది. తొలి రోజు నుంచి ఇప్పటివరకు బాక్సాపీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు మహేశ్. విడుదలైన మొదటి రోజు సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ మహేశ్ బాబు మాత్రం సినిమా సక్సెస్ అవడం పక్కా అని అంచనా వేయగా..అనుకున్నదే జరిగింది.
సూపర్ స్టార్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో సూపర్ హ్యాపీగా ఉన్న పరశురాంకు..సినిమా విడుదల తర్వాత సర్ప్రైజింగ్గా మహేశ్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందట. ఇదే విషయం గురించి పరశురాం మాట్లాడుతూ..’మహేశ్ రిలీజ్ డేన ఉదయం 8 గంటలకు నాకు ఫోన్ చేశాడు. చాలా సంతోషంగా ఉన్నారు. ఊహించని విధంగా నాకు శుభాకాంక్షలు చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు ఈ సక్సెస్ కావాలి. అందుకే ఆయన శుభాకాంక్షలు నాకు చాలా చాలా ముఖ్యమైనవి. అదే రోజు రాత్రి మేమంతా పార్టీలో కలిశాం. మహేశ్ చిన్నపిల్లాడిలా మారిపోయి ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేశారు. ఈ సక్సెస్తో రేండేళ్లుగా మేం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనిపించిందని’ చెప్పుకొచ్చాడు పరశురాం.
ఇక పరశురాంకు ఇండస్ట్రీకి చెందిన ఇతర దర్శకులు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ను కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత నెక్ట్స్ చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్టు చెప్పాడు పరశురాం.