టాలీవుడ్ (Tollywood)లో రాబోయే భారీ చిత్రాల్లో ఒకటి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). మహేశ్బాబు-పరశురాం (Parasuram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్లో మొదలైంది. మహేశ్బాబు సోమవారం షూటింగ్లో జాయిన్ కానున్నాడు. తాజా షెడ్యూల్తో సినిమా టాకీ పార్టు మొత్తం పూర్తయినట్టే. నవంబర్ చివరికల్లా సినిమాను పూర్తి చేసి..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనుంది పరశురాం టీం.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ బ్యాక్ టు బ్యాక్ పాటలతో సంగీత ప్రియులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలపై మహేశ్, పరశురాం టీం నుంచి క్లారిటీ రానుంది. గత కొన్ని సంవత్సరాల్లో ఇండియాలో సెన్సేషన్ సృష్టించిన బ్యాంకు మోసాలు, ఆర్థిక నేరాల నేపథ్యంలో సర్కారు వారి పాట సాగనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
సర్కారు వారి పాటలో కీర్తిసురేశ్ (Keerthy Suresh)ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!