హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 27 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ బుధవారం ప్రజాభవన్లో తొలి సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో మండలాలవారీగా వాతావరణ సమాచారం, పంటల విస్తీర్ణం వివరాలను శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత నిర్ణయాల కోసం సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. అంతర పంటలు, తకువ నీటితో సాగయ్యే పంటల అవసరాన్ని కమిటీ పేర్కొన్నది. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఇంధనం) నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.