మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదానికి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వారు కట్టు కథలు అల్లేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పీఆర్ఓ మహేష్ కోనేరు తన ట్విట్టర్ ద్వారా ప్రమాదం జరిగిన తీరుని వివరించారు.
సాయిధరమ్ తేజ్కు జరిగిన ప్రమాదం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పెద్ద వాహనాలు, వాటి డ్రైవింగ్ మీద ఏ అవగాహనా లేకుండా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లు కూడా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. సాయి అతి వేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడిపే వ్యక్తి కాదు. వీడియో చూసినట్టైతే రోడ్డుపై మట్టి,ఇసుక ఉండడం వలన ముందు వెళుతున్న ఆటో, ద్విచక్రవాహన దారుడు వాహనాలను స్లో చేశారు.
సాయి కూడా తన వాహనాన్ని స్లో చేసి ఆటోని దాటి వెళ్లానుకున్నాడు. కాని ఇసుక వల్ల బైక్ స్కిడ్ అయ్యింది. ఎంతో శిక్షణ ఉన్న రేసర్కైనా ఇది స్వరసాధారణంగా జరిగే ప్రమాదం. రోడ్డు సరిగ్గా లేనందున దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో సాయి తేజ్ హెల్మెట్ కూడా పెట్టుకొని ఉన్నాడు. ఆయన నియమాలను అతిక్రమించలేదు. యాక్సిడెంట్ అనేది ఎవరికైనా జరగొచ్చు. అది అంతటితో వదిలేయండి. అన్ని ప్రమాదాలకు అతివేగం ఒక్కటే కారణం కాదు’ అని మహేశ్ కోనేరు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.