టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడని తెలిసిందే. సినిమాలతో సంబంధం లేకుండా నెట్టింట ఏదో ఒక పోస్టుతో అభిమానులకు టచ్లోకి వస్తుంటాడు ఈ సూపర్ స్టార్. వెకేషన్ టూర్కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటాడు. సినిమా సినిమాకు మేకోవర్ మార్చుకుంటూ కొత్తగా కనిపిస్తుంటాడు. తన లుక్ ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూసే అభిమానుల కోసం కొత్త లుక్తో ఉన్న ఫొటోలు విడుదల చేస్తుంటాడు.
తాజాగా మహేశ్ సెల్ఫీ స్టిల్ (Mahesh selfie) ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో కొన్ని రోజులపాటు పాల్గొన్నాడు మహేశ్. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నాడని టాక్. కాగా మహేశ్ లేటెస్ట్గా ఐఫోన్ 14 (iPhone 14)తో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. త్రివిక్రమ్తో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్టులో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
త్రివిక్రమ్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్టుగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేశ్ బాబు. బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు స్టార్హీరోలతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ తెచ్చిపెట్టాడు జక్కన్న. మరి మహేశ్ ఇమేజ్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.