రీసెంట్గా పరశురాం డైరెక్షన్ లో చేసిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata) మంచి సక్సెస్ అందుకుంది. ఇపుడీ సినిమా సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu)..ఇప్పటికే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ , చిత్రయూనిట్తో సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నాడు మహేశ్. కొంతకాలంగా మహేశ్ బాబు ఏదో ఒక ఇంట్రెస్ట్రింగ్ విషయాన్ని ఇంటర్వ్యూల్లో పంచుకుంటున్నాడని తెలిసిందే. అలాంటి విషయాన్నే ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.
ఈ సినిమాలో మహేశ్ రూపాయి నాణెం పచ్చబొట్టు (tattoo) వేయించుకుని కనిపిస్తాడని తెలిసిందే. అయితే రియల్ లైఫ్లో కూడా టాటూ వేయించుకుంటారా..? అని మహేశ్ను అడిగారు యాంకర్. తానెప్పటికీ టాటూ వేయించుకోనన్నాడు. టాటూ వేయించుకున్న వాళ్లన్నా తనకిష్టముండదని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం యూరప్ ట్రిప్లో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్. ఈ ట్రిప్ పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోయే సినిమాను మొదలుపెట్టనున్నాడు. జులై నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్. ఈ ప్రాజెక్టులో మహేశ్ న్యూ లుక్లో కనిపించబోతున్నాడట.
మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో అడ్వంచరస్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఓ సినిమా చేయనున్నాడు మహేశ్. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథనందిస్తుండగా..సౌతాఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటివరకున్న టాక్.