టాలీవుడ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఐదేళ్ల క్రితం మహేశ్ బాబుతో జనగణమన సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనికి ఓపోస్టర్ కూడా సిద్దం చేయగా సినీ లవర్స్ చాలా ఎక్జయిట్ అయ్యారు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
పూరీ జగన్నాథ్ జనగణమన చిత్రాన్ని పవన్ కల్యాణ్ తో తీసేందుకు సిద్దమవుతున్నాడట. సామాజిక అంశాలు, సందేశాలతో కూడిన సినిమాలను చేసేందుకు పవన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో..పీకేను సంప్రదించాడట పూరీ. గతంలో పూరీ-పవన్ కాంబినేషన్ లో ఇదే జోనర్ లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వచ్చింది.
పూరీ పూర్తి స్క్రిప్ట్ ను పవన్ కు వినిపించిన తర్వాత పవర్ స్టార్ నుంచి వచ్చే నిర్ణయంతో సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఒకవేళ పవన్ ఈ ప్రాజెక్టును ఒకే చేస్తే ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కానుంది.
ఇవి కూడా చదవండి..
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్