కలెక్షన్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రతన్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. 30 ఏళ్ల క్రితం అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని ఇదే రోజు విడుదల చేయగా, సన్ ఆఫ్ ఇండియా టీజర్ను కూడా నేడే విడుదల చేసి ఫ్యాన్స్ కు ఆనందాన్ని అందించారు మోహన్ బాబు. ఈ సినిమా టీజర్ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రిలీజ్ చేయగా, ఈ టీజర్ చిరు వాయిస్ ఓవర్తో మొదలు కావడం విశేషం.
“మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నా అంటూ చిరంజీవి తన వాయిస్ అందించగా, ఎప్పుడు? ఏ వేషంలో ఉంటాడో? ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎప్పుడు, ఎలాంటి ఆలోచనలను పుట్టిస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్టూ చెప్పలేడు” అని మోహన్ బాబు గురించి క్లారిటీ ఇచ్చేశాడు చిరు. ‘నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ అని మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ పతాకం సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్పై మీరు ఓ లుక్కేయండి.