టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) పలు వాణిజ్య ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపుసామాజిక బాధ్యత విషయంలో కూడా ముందుంటారు మహేశ్. తాజాగా పురాతన కాలం సిద్ధ వైద్యాన్ని ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకున్నారు మహేశ్ బాబు. శంకర్ పల్లి సమీపంలోని మోకిల వద్ద చక్రసిద్ధ్ సెంటర్ (Chakrasiddh Centre) ను మహేశ్ బాబు ఇవాళ ప్రారంభించారు. శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్ కేఐ వర ప్రసాద్ రెడ్డి మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..నయం కాని రోగాలతో బాధపడుతూ వాటిని నుంచి ఉపశమనం పొందాలనుకునే వారి కోసం ఈ సెంటర్ ను డాక్టర్ సత్య సింధూజ (Dr Satya Sindhuja) నేతృత్వంలో ఏర్పాటు చేశారు. వివిధ రకాల నయం కాని సమస్యలతో బాధపడుతున్న వారికి సిద్ధ వైద్యం అద్బుతమైన చికిత్స. ప్రాచీన, సంప్రదాయ, ప్రామాణికమైన సిద్ధ వైద్యాన్ని ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
చాలా భిన్నమైన చక్రసిద్ధ నాడి వైద్యంలో డాక్టర్ సత్య సింధూజ నిపుణులు. ప్రపంచంలోనే ఇలాంటి వైద్యం అందిస్తున్న నిపుణుల్లో సత్య సింధూజ ఒక్కరే టాప్ లో ఉంటారేమోనని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. మైగ్రేన్, వర్టిగో, దేహంలోని నరాల రుగ్మతలే కాకుండా చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుందీ వైద్యం. డాక్టర్ సింధూజ సలహాలు, సూచనలు పాటిస్తే మంచి జీవనశైలి మన సొంతమవుతుంది. ఇలాంటి వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు మహేశ్ బాబు.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!