మహేశ్ బాబు (Mahesh Babu) కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా నిలిచింది ఒక్కడు (Okkadu). గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి.. మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది. కొన్ని నెలల క్రితం పోకిరి సినిమా రీ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది. కాగా ఇపుడు అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు ఒక్కడు కూడా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది.
ఒక్కడు చిత్రం ఎప్పుడు రాబోతుందనే అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ 2023 జనవరి 7న రీ రిలీజ్ కానుంది.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్వైడ్గా ఎంపిక చేయబడ్డ థియేటర్లలో ఒక్కడు స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. ఒక్కడు చిత్రంలో భూమికా చావ్లా హీరోయిన్గా నటించగా.. ప్రకాశ్ రాజ్ విలన్గా నటించాడు. ముఖేశ్ రిషి, అజయ్, తెలంగాణ శకుంతల కీలక పాత్రల్లో నటించారు.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించాడు. మణిశర్మ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ ఆల్ టైమ్ ఫేవరేట్ హిట్ లిస్టులో ఉంటాయి. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.
Read Also : Vijay Sethupathi | స్లిమ్గా విజయ్సేతుపతి.. ఈ లుక్తో సినిమా చేయరా అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్
Read Also : Rolex | సూర్యతో రోలెక్స్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్.. ముహూర్తం ఎప్పుడో ..?
Read Also : Virupaksha | పోస్టర్తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష కొత్త అప్డేట్
Read Also : Mission Majnu | ఓటీటీలోనే రష్మిక మందన్నా హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్ను