Maa elections voting | ఎన్నో రోజులుగా ఆసక్తి పుట్టిస్తున్న మా ఎన్నికలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మా అధ్యక్ష పీఠం గురించి గత రెండు మూడు నెలలుగా మీడియా ముందుకొచ్చి కొట్టుకుంటున్నారు. మేం గెలుస్తాం అంటే.. మేం గెలుస్తాం అంటూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతూ వైరం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఈసారి మా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. అసలు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలనే కుతూహలం అందరిలోనూ మొదలైంది. ఇలాంటి సమయంలో జరిగిన మా ఎన్నికల పోలింగ్లోనూ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నడూలేనిది ఈ సారి రికార్డుస్థాయి పోలింగ్ నమోదైంది.
ప్రతిసారి మా ఈ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 500 మంది కంటే ఎక్కువ ఓట్లు వేసినట్లు చరిత్ర చెప్పడం లేదు. మహా అయితే 550 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా 690 ఓట్లు పోలయ్యాయి. ఇది చూసిన తర్వాత నిజంగానే అందరూ షాక్ అవుతున్నారు. మా ఎన్నికల్లో ఇంతటి మార్పు ఎలా వచ్చింది.. ఎవరి కోసం 700 మంది వచ్చి ఓటు వేశారు.. ఎవరిపై కోపంతో ఎవరికి ఓటు వేశారు? ఇది నిజంగా విచిత్రంగా ఉంది అంటూ మా సభ్యులు షాక్ అవుతున్నారు.
ఈసారి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోయారు. తాము గెలిస్తే ఏం చేస్తాం అనేది కూడా మా సభ్యులకు అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైంది. అక్టోబర్ 10 ఆదివారం రాత్రిలోగా మా ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మంచు విష్ణుకు గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA Elections: శివ బాలాజీ చేయి కొరికిన హేమ.. ఏం జరిగిందో ఎలక్షన్ త
MAA: మా ఎన్నికల్లో రిగ్గింగ్ అనుమానాలు!ర్వాత చెప్తానంటూ కామెంట్
Roja: చివరకు అందరం కలిసి కట్టుగా ఉంటాం: రోజా
కొడుకు జైల్లో.. తిండి, నిద్ర లేక నిస్సహాయుడిగా షారుక్ఖాన్!
Samantha | ఎన్టీఆర్ షోలో సమంత మెరిసే తేదీ ఫిక్స్..!
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు