మా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇరు ప్యానెల్ సభ్యులు పోలింగ్ ప్రాంతంలో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . ఓ వర్గం వారు రిగ్గింగ్ జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల అధికారి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
రిగ్గింగ్ జరిగిందని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి అంటున్నారు. ఫలితాలు కూడా ఆపేస్తాం అని చెప్పినట్టు సమాచారం. ఎన్నికల అధికారుల చర్యలపై ఉత్కంఠ నెలకొంది. అయితే రిగ్గింగ్ జరిగే అవకాశం లేదని, కార్డ్ ఉంటేనే ఓటు వేసే అవకాశం ఉందని కరాటే కళ్యాణి చెబుతుంది. మరోవైపు మోహన్ బాబు .. బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.
ప్రకాశ్ రాజ్ గన్స్ మెన్స్ పోలింగ్ బూత్లోకి రావడంపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రకాశ్ రాజ్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది.