టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). సామాన్యులతోపాటు, సెలబ్రిటీలు కూడా ఈ షోలో సందడి చేస్తున్నారనే విషయం తెలిసిందే. హీరోయిన్ సమంత (Samantha) కూడా ఈ షోలో మెరువబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే సామ్ ఎవరు మీలో కోటీశ్వరులులో ఎప్పుడు తళుక్కుమనబోతుందనే దానిపై ఓ ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ నెల 14న జెమినీ టీవీలో సమంత స్పెషల్ ఎపిసోడ్ ప్రీమియర్ కానుందని తాజా సమాచారం.
అంతేకాదు మరో క్రేజీ అప్ డేట్ ఏంటంటే..మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కూడా త్వరలోనే ఈ షోలో కనిపించబోతుందట. మరి రానున్న ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ తో టాలీవుడ్ భామల సందడి బాగానే ఉంటుందని తెగ చర్చించుకుంటున్నారు. ఈ షోలో ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు రాంచరణ్, రాజమౌళి, కొరటాల శివ సందడి చేసిన సంగతి తెలిసిందే.
దసరా సందర్భంగా మహేశ్ బాబు, ఎన్టీఆర్ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారంకానుందని ఇప్పటికే వార్తలు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ మహేశ్ బాబు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ