మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవతర్తంగా సాగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలు అందరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలలో పోటీ చేస్తున్న ఎవరు ఎవరికి శత్రువు కాదని ఆమె అన్నారు.
ఇక్కడ ఉన్నది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబం. కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందరు కలిసి కట్టుగా ఉండడం సంతోషంగా అనిపించింది. మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు ఓడిన, ఎవరు గెలిచినా కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాలి. విద్వేష రాజకీయాలు ఆపండి.
పక్కన ఉండి మాట్లాడే వాళ్ల వలన గొడవలు జరుగుతన్నాయి. రెండు ప్యానల్లో నాతో పని చేసిన వారె ఉన్నారు. చివరికి అందరం కలిసి కట్టుగా ఉంటాం’ అంటూ రోజా చెప్పుకొచ్చారు.