ఈ సారి మా ఎన్నికలు ఎప్పుడూ లేనంత ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. ఒకేసారి నలుగురు అధ్యక్ష బరిలో దిగారు. పైగా నోటిఫికేషన్కి ఇంకా మూడు నెలల సమయం ఉంది. అయినా కూడా ఎన్నికల హడావిడి అప్పుడే మొదలుపెట్టారు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఎవరివైపు నిలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు హీరోలు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానల్కు చిరంజీవి అండగా ఉన్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నాగబాబు కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. మరోవైపు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్యానల్ వైపు బాలకృష్ణ ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయనతో పాటు సీనియర్ హీరోలు కృష్ణ, కృష్ణంరాజు కూడా మంచు విష్ణు వైపు నిలబడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటేష్, నాగార్జున ఎప్పటిలాగే చాలా సైలెంట్గా ఉన్నారు. అయితే తాజాగా మరో వార్త కూడా బయటకు వస్తుంది. ఈసారి ఎలక్షన్స్ కోసం నందమూరి హీరోలు కలిసుండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకరికే సపోర్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. గతంలో ఎప్పుడూ కూడా బాలయ్య, ఎన్టీఆర్ మా ఎన్నికల కోసం కలిసింది లేదు. కానీ ఈ సారి మాత్రం పరిస్థితులు మారిపోతున్నాయి. బాబాయి, అబ్బాయి కలిసి మంచువారి అబ్బాయికి అండగా నిలబడేలా కనిపిస్తున్నారు. ఒకవేళ నందమూరి కథానాయకులు కలిసి అండగా నిలిస్తే మంచు విష్ణుకు విజయావకాశాలు కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే బాలకృష్ణ, ఎన్టీఆర్ ను సపోర్ట్ చేసే మా సభ్యుల ఓట్లు విష్ణుకు పడడం ఖాయం. మొత్తానికి చూడాలి ఈసారి ఎన్నికలను ఇంకా ఎంత రసవత్తరంగా మార్చనున్నారో..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఆర్ఆర్ఆర్ పోస్టర్పై సైబరాబాద్ పోలీసుల సెటైర్
కత్రినాకైఫ్ రాఖీ కడతానంటే వద్దన్నారట..స్టోరీ చదవాల్సిందే
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
లిప్ కిస్ టాక్ తో తాప్సీ పబ్లిసిటీ