టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు లైగర్ (Liger). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి అనన్య పాండే (Ananya Panday) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా కొత్త అప్ డేట్ బయటకు వచ్చింది. లైగర్ పోస్ట్ థియాట్రికల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని ఇప్పటికే న్యూస్ లైమ్ లైట్లోకి. అయితే లేటెస్ట్ గా దీనిపై మరో అప్ డేట్ తెరపైకి వచ్చింది.
లైగర్ పోస్ట్ థియాట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం (Disney+ Hotstar) భారీ మొత్తానికి దక్కించుకుందట. తాజా సమాచారం ప్రకారం లైగర్ ఓటీటీ డీల్ రూ.65 కోట్లకు కుదిరిందని ఇన్ సైడ్ టాక్. సౌతిండియా సినిమా ఓటీటీ అతి పెద్ద ఒప్పందాల్లో ఇది. ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది లైగర్.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్రలో కనిపించనున్నాడు. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. లైగర్ మూవీని పూరీ జగన్నాథ్, ఛార్మీ, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదల కానుంది.