టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్లలో ఒకటి విజయ్ దేవరకొండ (Vijay devarakonda)-సమంత (Samantha). ఈ ఇద్దరు ప్రస్తుతం మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ఖుషీ (Kushi)సినిమా చేస్తున్నారని తెలిసిందే. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 15 నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుందంటూ ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చేసింది.
కాగా మరో అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఖుషీ యూఎస్ఏ పంపిణీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని తాజా టాక్. ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం పంపిణీ హక్కులు రూ.6 కోట్లు పలికాయి. అంటే ఈ లెక్కన ఖుషీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్ జోన్లోకి రావాలంటే రూ.9 కోట్లకుపైగా వసూలు చేయాలని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.
యూఎస్ఏలో విజయ్ దేవరకొండకు మార్కెట్ బాగానే ఉంటుంది. మరి తొలి రోజు టాక్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి.. ప్రాఫిట్ జోన్ పై అంచనాలు వేసే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందనేది చూడాలి.
ఖుషీ చిత్రంలో కన్నడ యాక్టర్ జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ , రోహిణి, లక్ష్మి,కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ-సమంత కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు, మూవీ లవర్స్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Kamal Haasan | ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా వారే నిర్ణయిస్తారు.. కమల్ హాసన్
Read Also : Nani | సంతోష్ శోభన్లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Varun Tej | పిక్ టాక్.. వర్షంలో వరుణ్ తేజ్, నాగబాబు ఇంతకీ ఎక్కడికెళ్లారు.. ?