హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఏపీలోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. విమానాశ్రయ రూపకల్పన, ఆధునిక సదుపాయాలు, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. గతంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించిన ఒక్క కుటుంబం పేర్లే ఉండేవని పరోక్షంగా కాంగ్రెస్కు చురకలు అంటించారు.