లైగర్ సినిమాకు సంబంధించిన ఎగ్జిబిటర్ల నష్టాలను చెల్లించే విషయంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కు ఎగ్జిబిటర్లకు మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తన ఇంటి వద్ద ధర్నా చేయాలని ఎగ్జిబిటర్లు ప్లాన్ చేయగా.. పూరీ జగన్నాథ్ తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆశ్రయించాడు. పోలీసులు కూడా పూరీ ఇంటి వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కాగా ఇవాళ పూరీ ఒక ఫిలాసఫికల్ లెటర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది.
‘జీవితం అంటే ఒడిదుడుకులతో కూడింది. సక్సెస్, ఫెయిల్యూర్ అంటే రెండూ ఒకదానికోటి వ్యతిరేకమనుకుంటాం. కాదు ఈ రెండూ ఫ్లోలో ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పీలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చేయాల్సిన పని ఏంటీ..? ఊపిరి వదిలెయ్యటమే. పడతాం, లేస్తాం, ఏడుస్తాం, నవ్వుతాం, ఎన్నో రోజులు ఏడ్చిన తర్వాత జరిగేది ఏంటీ..? పగలబడి నవ్వటమే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.. లైఫ్లో మనకు జరిగే సంఘటనను ప్రయోగం చూడాలి తప్ప, ఫెయిల్యూర్, సక్సెస్ లా చూడకూడదు..’ అంటూ సుదీర్ఘ అంశాలతో రాసిన ఫిలాసఫికల్ లెటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
‘నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను తప్ప నేనెవరినీ మోసం చేయలేదు. . మళ్లీ ఇంకో తీస్తా.. వాళ్లకు వినోదం పంచుతా.. ఇక డబ్బు అంటారా..? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలుసుకునేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా’ అంటూ ముగించాడు పూరీ.
‘నన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..? నేను ఎవరికీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకిస్తున్నా.. పాపం వాళ్లు కూడా నష్టపోయారనే సానుభూతితో మాత్రమే రిగివ్వాలనుకుంటున్నా. మేము ఎందుకిస్తున్నాం.. పరువు కోసం ఇస్తున్నాం. కానీ నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అయినా ఎగ్జిబిటర్స్ కు నాకు సంబంధం ఏంటీ ’ అంటూ సాగే పూరీ వాయిస్ కాల్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
Read Also : Nani | సంతోష్ శోభన్లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Vaarsudu Movie | భారీ ధరకు ‘వారసుడు’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?