గత ఏడాది కరోనా వలన ఎందరో ప్రముఖులు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. తాజాగా కరోనాతో మా అబ్బాయి అనే సినిమాతో దర్శకుడిగా మారిన కుమార్ వట్టి కన్నుమూశారు. ఆయన మృతికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కుమార్ వట్టి మొదటగా పరుశురాం వద్ద అసిస్టెంట్గా పని చేశారు. యువత సినిమా కోసం పరుశురాం వద్ద కుమార్ వట్టి పని చేశారు. ఆ తరువాత సోలో సినిమాకు కూడా పనిచేశారు.
సోలో సినిమా సమయంలోనే విష్ణుతో పరిచయం ఏర్పడడంతో ఆయనతో కలిసి మా అబ్బాయి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కుమార్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట కాగా, ఆయన వయస్సు 39 సంవత్సరాలు. అవివాహితుడిగానే ఉన్న కుమార్ వట్టి గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతూ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్లాస్మా కూడా ఎక్కించారు. అయిన ఆయనను వైద్యులు కాపాడలేకపోయారు. ప్రస్తుతం సర్కారు వారీ పాట సినిమాకు అసోసియేట్గా పనిచేస్తున్నారు. ఆయన మృతి తీరని విషాదాన్ని మిగిల్చింది.
ఇవికూడా చదవండి..