Chiranjeevi -KS Bharat : దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్(Padam Vibhushan) అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాల ప్రముఖులు టాలీవుడ్ స్టార్ హీరోకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చిరంజీవి టీమిండియా క్రికెటర్ నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్(KS Bharat)) చిరూను కలిసి తన టెస్టు జెర్సీ(Test Jersey)ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
రంజీల్లో నిలకడగా రాణించిన భరత్.. నిరుడు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై నాగ్పూర్ టెస్టుతో టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. తొలి టెస్టు సిరీస్లోనే ఈ తెలుగు కుర్రాడు అంచనాలకు మించి రాణించాడు. ఈమధ్యే ఇంగ్లండ్ లయన్స్పై సెంచరీ కొట్టాక శ్రీరాముడిలా విల్లు ఎక్కుపెట్టి వైరల్ అయ్యాడు.
KS Bharat gifted his Indian test jersey to Superstar Chiranjeevi.
– Great gesture by Bharat. 👏 pic.twitter.com/EcmnXdzNky
— Johns. (@CricCrazyJohns) January 29, 2024
స్వదేశంలో ఇంగ్లండ్తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భరత్ నాలుగు క్యాచ్లు పట్టాడు. బ్యాటుతోనూ రాణించి 69 రన్స్ కొట్టాడు. అయితే.. టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలడంతో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2న వైజాగ్లో రెండో టెస్టు జరుగనుంది.
శ్రీకర్ భరత్
మరోవైపు… ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి అనతికాలంలోనే అగ్రహీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు తెరపై అభిమానులను అలరించాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరూ ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
చిరంజీవి
అనంతరం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ స్టార్ హీరో 2017లో ఖైదీ నంబర్ 150తో మళ్లీ వెండి తెరపై మెరిశాడు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యతో బంపర్ హిట్ ఖతాలో వేసుకున్న మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.