Poonam Pandey | ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) తనను తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించుకొని చిక్కుల్లో పడింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కోల్కతాకు చెందిన (Kolkata man) అమిత్ రాయ్ అనే వ్యక్తి.. ఏకంగా కోర్టును ఆశ్రయించారు.
చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అని, అలాంటి ప్రకటన ద్వారా పూనమ్ పాండే తీవ్ర గందరగోళం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూనమ్ పాండే మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పూనమ్ పాండేకు కోర్టు ద్వారా లీగల్ నోటీసులు (legal notice) పంపారు.
కాగా, గత శుక్రవారం గర్భాశయ క్యాన్సర్ (cervical cancer )తో పూనమ్ పాండే చనిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. స్వయంగా నటి టీమే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో పూనమ్ చనిపోయిందని అంతా భావించారు. ఈ మేరకు ఆమె మృతికి సంతాపంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పూనమ్ తన మరణంతో కొత్త పబ్లిసిటీ స్టంట్ (publicity stunt) చేస్తోందంటూ సోషల్ మీడియా మొత్తం చెప్పుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ పూనమ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని వివరణ ఇచ్చింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాన్సర్పై అవగాహన కోసం చనిపోయానని చెప్పడం తీవ్ర విషయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
Actor Vishal | విజయ్ బాటలో విశాల్.. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన..?
Vande Bharat | వందే భారత్ ఆహారంలో బొద్దింక
Zambia | కలరా కోరల్లో జాంబియా.. మానవతను చాటుకున్న భారత్