బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ విషయాన్నైన నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తనకు తప్పనిపిస్తే వెంటనే చెప్పేయడానికి కంగనా ఏ మాత్రం వెనకాడదు. తాజాగా మహారాష్ట్ర సర్కారుపై ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గడంతో.. దేశ వ్యాప్తంగా అన్ని కార్యకలపాలు యధావిధిగా సాగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్స్ తెరిచేందుకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని కంగనా అన్నారు. సినీ రంగంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతుందని ఆయన అన్నారు. దీనిపై ఎవరు నోరు మెదపకపోవడం బాధాకరం. విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాల నిర్మాతలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. థియేటర్లు తెరవడానికి ఒప్పుకోకుండా వాటిని పూర్తిగా మూసేయాలని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోందని ఆమె ఆరోపించారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తలైవి అనే సినిమా రూపొందగా, ఈ సినిమాలో కంగనా లీడ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.