కియారా అద్వానీ.. తెలుగుతో పాటు హిందీలోనూ గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ. ఇక్కడా అక్కడా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ధోనీ సినిమాతో.. ఇక్కడ భరత్ అనే నేనుతో బాగానే క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ తో నటించిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యేసరికి కియారాను తెలుగులో పట్టించుకోవడం మానేసారు కానీ హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో జోడీ కట్టింది ఈ భామ. అది బ్లాక్ బస్టర్ అయ్యేసరికి కియారా కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. అయినా లస్ట్ స్టోరీస్ లో కైరా రెచ్చిపోయిన తీరు చూసిన తర్వాత ఎలాంటి పాత్రకైనా ఆమె రెడీ అని అర్థమైపోతుంది. కియారాకు దక్షిణాదిన అందాలు ఆరబోయడం కూడా చిన్న విషయమే. కబీర్ సింగ్ తర్వాత అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది కియారా.
లస్ట్ స్టోరీస్ లో స్వయంతృప్తి సన్నివేశాల్లోనే నటించిన ఈమెకు ఇప్పుడు గ్లామర్ షో అనేది లెక్కే కాదు. అన్నట్లుగానే ఇప్పుడు మరోసారి సంచలన ఫోటోషూట్ చేసింది. ఇది చూసిన కుర్రాళ్లకు నిద్ర కూడా రావడం లేదు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఉండేలా డబూ రత్నాని కాలెండర్ కోసం ఈ ఫోటోషూట్ చేసింది కియారా అద్వానీ. అది కూడా బీచ్ ఒడ్డున ఈ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇది చూసి ఫిదా అయిపోతున్నారంతా. మరోవైపు గతేడాది కూడా ఇలాంటి హాట్ ఫోటో షూట్ చేసింది కియారా. అప్పుడు కేవలం ఆకు అడ్డు పెట్టుకుని ఈ షూట్ చేసింది. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోసారి డబూ రత్నాని కోసం రెచ్చిపోయింది కియారా.