తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్టులో నటిస్తూ వన్ ఆఫ్ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది కీర్తిసురేశ్ (keerthy suresh). ఈ భామ ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. కాగా కీర్తిసురేశ్ తన తల్లి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. కీర్తిసురేశ్ తల్లి మేనకా సురేశ్ (Menaka Suresh) ఒకప్పటి హీరోయిన్ అని తెలిసిందే.
ఈ సీనియర్ నటి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ భ్రమమ్ (Bhramam) లో కీలక పాత్రలో నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను చూపించింది. వుడ్ వాల్ పై ఉన్న పోస్టర్ లో ఉన్న మేనకను కీర్తిసురేశ్ ఆసక్తికరంగా చూస్తున్న స్టిల్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమ్మ భ్రమమ్ ప్రపంచంలో నీవు ఎలా ముగిస్తావు అంటూ అడుగుతూ క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు సినిమా హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ను..నేను చూస్తున్నది నిజమేనా..? అంటూ అడిగుతూ అతనికి ట్యాగ్ చేసింది.
అక్టోబర్ 7న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. భ్రమమ్ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అంధాధున్ కు రీమేక్. ఈ చిత్రాన్ని రవి కే చంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా..రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మేనకా సురేశ్ ఈ చిత్రంలో కీ రోల్ లో కనిపించబోతుందని కీర్తిసురేశ్ తాజా పోస్టుతో హింట్ ఇచ్చినట్టు అందరూ తెగ చర్చించుకుంటున్నారు.
– Advertisement –
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!