రోడ్డు ప్రమాదం తర్వాత షూటింగ్కు దూరమైన మెగా హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej)..మళ్లీ తన నెక్ట్స్ ప్రాజెక్టు SDT 15 పనులతో బిజీ అయిపోయాడు. సాయిధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం సినిమా సెట్స్కు వచ్చిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేశాయి. కాగా చాలా రోజుల తర్వాత సినీ లవర్స్ కు కొత్త అప్డేట్ ఇచ్చింది సాయిధరమ్ టీం.
కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్నాథ్ను టీంలోకి స్వాగతం పలికింది చిత్రయూనిట్. కిరాక్ పార్టీ సినిమా తర్వాత అంజనీశ్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతుంది.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజనీష్ సంగీతం అందించిన కాంతారా మూవీ తెలుగు వెర్షన్ అక్టోబర్ 14న విడుదల కానుంది. గతేడాది పొలిటికల్ డ్రామా నేపథ్యంలో దేవాకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
Delighted to welcome Musical wizard 🎶 @AJANEESHB on board for #SDT15 @IamSaiDharamTej @Iamsamyuktha_ @karthikdandu86 @bkrsatish @BvsnP @aryasukku @SVCCofficial @SukumarWritings pic.twitter.com/2pwL9SQbN6
— SVCC (@SVCCofficial) October 12, 2022
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Puri Jagannadh | గాడ్ఫాదర్తో పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూ..లైవ్ స్ట్రీమింగ్ నేడే
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్