కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం (Vijay 66th) 66వ సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాపై తాజా అప్ డేట్ ఒకటి ఇపుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈద్ బ్రేక్ ముగిసిన తర్వాత త్వరలోనే రష్మిక కూడా సెట్స్ లో జాయిన్ కానుందని టాక్.
ఇప్పటివరకు విజయ్పై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేశారు వంశీ టీం. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నాడట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ ప్రాజెక్టు వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇటీవలే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో బీస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్.
ఈ సినిమా తమిళనాట మంచి విజయం సాధించగా..తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో విజయ్ తండ్రి పాత్రలో స్టార్ యాక్టర్ శరత్కుమార్ నటించనున్నాడని వార్తలు వస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.