నందమూరి అభిమానుల నోట ఎప్పుడూ వినిపించే మాట.. పాట జై బాలయ్య. థియేటర్లలో సినిమా స్క్రీనింగ్ అవుతుందంటే చాలు.. అది ఏ హీరో సినిమా అయినా సరే తమకు నచ్చిన సీన్, సాంగ్, ఫైట్ వచ్చిందనే వెంటనే జై బాలయ్య స్లోగన్స్ తో హోరెత్తిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడరు సినీ జనాలు. మరోసారి జై బాలయ్య మేనియాను కొనసాగించేందుకు స్టార్ డైరైక్టర్ టీం జై బాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం వీరసింహారెడ్డి (veerasimhareddy). గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జైబాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. కరీముల్లా పాడారు.
రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్, వైట్ అండ్ వైట్ డ్రెస్లో బాలకృష్ణలా మారిపోయి డ్యాన్స్ చేస్తుండటం చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్
బాలకృష్ణ వైట్ అండ్ వైట్ డ్రెస్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని అభిమానులకు కావాల్సిన విజువల్ ట్రీట్ అందిస్తూ..సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎస్ థమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్తో గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా సాంగ్తో అర్థమవుతుంది.
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలోపక్కా మాస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్గా నటిస్తుండగా.. కేజీఎఫ్ అవినాష్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్బాబు ఎమోషనల్ ట్వీట్..