Kajal Aggarwal | మోసగాళ్లు, హే సినామిక ప్రాజెక్టుల తర్వాత టాలీవుడ్ కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తోన్న తమిళ చిత్రం ఘోస్టీ (Ghosty). కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2023 మార్చి 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఘోస్టీ శాటిలైట్ రైట్స్ను జీ తమిళ్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను జీ5 దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఘోస్టీ చిత్రంలో రాధికా శరత్ కుమార్, యోగి బాబు, కేఎస్ రవికుమార్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీడ్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ ద్విపాత్రాభినయంలో నటిస్తోంది. హార్రర్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
ప్రస్తుతం శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2లో నటిస్తోంది కాజల్. మరోవైపు హిందీలో ఉమ ప్రాజెక్టులో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో మరో సినిమా చేస్తోంది.
Get ready for the endless comedy, roller coaster ride 🥳🥳#Ghosty releasing in theatres on March 17th.
Starring @iYogiBabu and me 👻
A @samcsmusic Musical
@Kalyaandirector @Sudhans2017 @Jayaram_gj @seedpictures1 @ksravikumardir @editorvijay @jacobcamkid @DoneChannel1 pic.twitter.com/JVEyDOXmMb— Kajal Aggarwal (@MsKajalAggarwal) March 5, 2023